ఈ నెల 11 నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన..

110
- Advertisement -

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ నెల 11న జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. గతంలో పలుమార్లు వాయిదా పడిన జిల్లాల పర్యటనను ఈసారి పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం అందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నెల 11 నుంచి పర్యటనను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా నిజామాబాద్, హనుమకొండ, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ తదితర జిల్లాల్లో పర్యటిస్తారు.

జనగామ పర్యటనతో వీటికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని కొత్తగా నిర్మించిన టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇక జిల్లాల పర్యటనల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల భవన సముదాయాన్ని, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభిస్తారు.

- Advertisement -