మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ..!

94
kcr
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై ఈ నెల 18వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరుగనున్నది.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీపీఓలు, రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

- Advertisement -