నేడే ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ విందు

431
cm kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. ఇవాళ ఎల్బీస్టేడియంలో క్రైస్తవ సోదరులకు సీఎం కేసీఆర్ గ్రాండ్‌గా క్రిస్మస్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఈ విందుకు దాదాపు 10 వేల మంది క్రైస్తవులు హాజరుకానున్నారని సమాచారం. ఇందుకోసం రూ.33 కోట్లను కేటాయించారు.

అలాగే.. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు లక్షల క్రైస్తవ కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇప్పటికే పలు చర్చీల్లో దుస్తుల పంపిణీ జరుగుతోంది.

క్రిస్మస్‌ విందు సందర్భంగా ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ట్రాఫిక్‌ అంక్షలు సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10 వరకు కొనసాగనున్నాయి.

- Advertisement -