యాసంగి పంటల సాగుపై సీఎం కేసీఆర్ సమీక్ష…

259
cm kcr
- Advertisement -

పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో మధ్యాహ్న 2.30గంటలకు జరిగే ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌శాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయాశాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

గతేడాది ఎన్ని ఎకరాల్లో పంటలు వేశారు?.. ఎంత ధర వచ్చింది? తెలుపాలని, యాసంగి మక్కల సాగులో లాభమా..నష్టామా?.. ప్రస్తుత మార్కెట్‌పై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించనున్నారు. ఈ సమావేశంలో మక్కల సాగుపై విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. సమగ్ర వివరాలతో సమావేశానికి రావాల్సిన అధికారులను ఆదేశించారు.

- Advertisement -