గోదావ‌రికి సీఎం కేసీఆర్ శాంతి పూజ

63
kcr cm
- Advertisement -

ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్ గోదావరి నదికి శాంతిపూజ నిర్వహించారు. వంతెన పైనుంచి గోదావ‌రి ప‌రిస‌రాల‌ను సీఎం ప‌రిశీలించారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలించారు.

అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులకు అందుతున్న వైద్యం, తదితర సహాయ కార్యక్రమాలను తెలుసుకుని వారికి భరోసానిస్తారు.

ఆ తర్వాత వరద పరిస్థితికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా చేపట్టిన సహాయ కార్యక్రమాలపై, చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలపై మంత్రులు పువ్వాడ అజయ్, హరీశ్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

- Advertisement -