సిద్దిపేటకు త్వరలో ఎయిర్‌పోర్ట్‌: సీఎం కేసీఆర్

229
cm kcr
- Advertisement -

సిద్దిపేట డైనమిక్ ప్రాంతం… రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎయిర్ పోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు సీఎం కేసీఆర్. సిద్దిపేట పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు సీఎం కేసీఆర్.

రూ.45 కోట్లతో సిద్దిపేట శివారులో నిర్మించనున్న ఐటి టవర్ నిర్మాణం కు శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్.ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

రూ.22 లక్షలతో మిట్టపల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల కు ప్రారంభోత్సవం చేశారు.ప్రభుత్వ మెడికల్ కళాశాల అవరణలో రూ.225 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 960 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.

నర్సాపూర్ లో రూ. 163 కోట్లతో నిర్మించిన 2460 2bhk ఇండ్ల తొలి గేటెడ్ కమ్యూనిటీ కి పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -