వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ రివ్యూ..

57
kcr
- Advertisement -

ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, విధి విధానాలతోపాటు ఇతర అంశాలపై కే కేశవరావు నేతృత్వంలోని కమిటీతో సీఎం సమావేశం కానున్నారు.

కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. ఈ చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు వివరాలు అందజేసింది. ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశంలో వజ్రోత్సవాల కార్యాచరణకు తుదిరూపు ఇవ్వనున్నారు.

- Advertisement -