నల్లగొండపై సీఎం కేసీఆర్ వరాల జల్లు..

59
kcr cm
- Advertisement -

నల్లగొండ మున్సిపాలిటీని ఆధునికరించేందుకు గాను నుడా(నల్లగొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) గా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మరిన్ని వరాలు ప్రకటించారు.నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తండ్రి దివంగత నర్సింహ దశదిన కర్మలలో పాల్గొనేందుకు సీఎం గురువారం నార్కెట్‌పల్లికి చేరుకున్నారు. అనంతరం జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,మున్సిపల్ కమిషనర్ రమణాచారి తదితరులతో కలసి నుడాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

నల్లగొండ జిల్లా కేంద్రం ప్రవేశంలో ఉన్న మర్రిగూడ బైపాస్ రోడ్‌పై బై-పాస్ రోడ్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతే గాకుండా నల్లగొండ నడిబొడ్డున ఉన్న పెద్ద గడియారం సెంటర్‌లో ప్రస్తుతం ఉన్న ఆర్&బి అతిథి గృహం స్థానంలోనే అధునాతన సౌకర్యాలతో నాలుగు అంతస్థుల ఆర్&బి వసతి గృహం నిర్మించ తలపెట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దానికి తోడు నల్లగొండ-నాగార్జున సాగర్ రహదారిపై ఉన్న యస్ఎల్‌బిసి కార్యాలయ ప్రాంగణంలో చీఫ్ ఇంజినీర్ కార్యాలయం నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

- Advertisement -