గాంధీజీ మార్గం ఆచరణీయం : సీఎం కేసీఆర్‌

383
cm kcr
- Advertisement -

గాంధీజీ మార్గం సదా ఆచరణీయం అన్నారు సీఎం కేసీఆర్. మహాత్మాగాంధీ 72వ వర్ధంతి సందర్భంగా గాంధీజీని స్మరించుకున్న సీఎం…. సత్యం, అహింస సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం అందించారని చెప్పారు.

గాంధీజీ సందేశం అనేక సమస్యలకు పరిష్కారం చూపించిందని…ఎంతటి కష్టతరమైన లక్ష్యాన్నైనా సత్యాగ్రహ దీక్షతో సాధించొచ్చు అని గాంధీజి నిరూపించారని చెప్పారు.

గాంధీ వర్ధంతి సందర్భంగా బాపుఘాట్‌లో నివాళులు అర్పించారు గవర్నర్‌ తమిళిసై. ఈ సందర్భంగా సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -