ఢిల్లీలో సీఎం కేసీఆర్….

165
kcr cm
- Advertisement -

ఢిల్లీ చేరుకున్నారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు. గురువారం మధ్యాహ్నం వసంత్ విహార్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ భవన నిర్మాణం కోసం 1300 గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు కేంద్రం నుండి భూమి పత్రాలను తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గతంలోనే తీసుకొన్నారు. ఈ నెల 2వ తేదీన మంచి ముహుర్తం ఉండటంతో రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేటీఆర్ సహా పలువురు మంత్రులు, నేతలు ఇవాళ ఉదయమే ఢిల్లీకి వెళ్లారు.

- Advertisement -