యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

324
yadadri
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు.బాలాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అర్చకులు.

యాదాద్రి పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడ త్వరలో నిర్వహించే మహాసుదర్శన యాగంపై కూడా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

దాదాపు రెండువేల కోట్ల ప్రాథమిక అంచనావ్యయంతో ప్రారంభించిన నిర్మాణపనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయి. ఆలయం లోపల ఆళ్వార్ల విగ్రహాలు, ఆంజనేయస్వామి ఆలయం, 28 అష్టభుజి నిర్మాణాలు వాటిపై విమానాల నిర్మాణం పూర్తయింది.  కొండపైన నిర్మాణమవుతున్న ప్రధానాలయ పనులపై సీఎం కేసీఆర్ హోటల్ హరితలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

- Advertisement -