నేడు మానుకోటలో కేసీఆర్ బహిరంగ సభ..

292
CM KCR
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కారు జోరు పెంచింది. టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఈ రోజు సాయంత్రం మహబూబాబాద్ జిల్లాలో జరిగే భారీ ప్రచార సభకు హారుకానున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇల్లందు రోడ్డులో ఏర్పాటు చేసిన మైదానంలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనం హారుకానున్నారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో సుమారు 50 ఎకరాలలో స్థలంలో సభావేదికను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి అతి సమీపంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. ఈ సభ ఏర్పాట్లను మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పర్యవేక్షిస్తున్నారు.

సభా ఏర్పాట్లను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ పరిశీలించారు. సాయంత్రం 4.00 గంటలకు ఈ బహిరంగ సభ జరగనుంది.

- Advertisement -