కరోనాపై సీఎం కేసీఆర్‌ సమీక్ష..

411
kcr
- Advertisement -

జనతా కర్ఫ్యూ స్ఫూర్తిగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా మార్చి 31 వరకు లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్‌ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 31 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇదే అంశంపై సీఎం కేసీఆర్‌సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ప్రెస్‌ మీట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ వివరాలను వెల్లడిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో చప్పట్లు కొడతారు.

- Advertisement -