పద్మారావుగౌడ్‌ను ప్రశంసించిన సీఎం కేసీఆర్‌..

254
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. పద్మారావు డిప్యూటీ స్పీకర్ అని అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ సీఎంగా ఎన్నికైన పద్మారావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సభలో ఆయన మాట్లాడుతూ, గత 20 ఏళ్ల నుంచి పద్మారావుతో తనకు మరిచిపోలేని అనుబంధం ఉందని చెప్పారు.

Padma Rao Goud

2001లో కార్పొరేటర్ పదవిని వదులుకుని టీఆర్ఎస్ లో పద్మారావు చేరారని… జంటనగరాల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నేత అని కితాబిచ్చారు. జంటనగరాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. పదవిలో ఉన్నా, లేకపోయినా ఆయన ఒకేలా ఉంటారని అన్నారు. భవిష్యత్తులో పద్మారావు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

- Advertisement -