యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు..

68
- Advertisement -

యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రధానాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్ దంపతులు.

వేద వేద పారాయణ పురోహితులు అర్చకులు రుత్విక్ యాగ్నిక బృందం పాల్గొని ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతుండగా మహా పూర్ణాహుతి మహా కుంభాభిషేకం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.

ఆరో రోజు ఉదయం 10.25 గంటలకు ధనిష్టా నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పటిక లింగ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట ప్రతిష్ట హోమం వైభవోపేతంగా జరిగాయి.

- Advertisement -