వెండితెరకు తీరని లోటు: సీఎం కేసీఆర్

93
kcr
- Advertisement -

ప్రముఖ నటుడు కృష్ణం రాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు మృతి తెలుగు తెరకు తీరని లోటని..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమన్నారు. వారి యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్నారని తెలిపారు.

- Advertisement -