- Advertisement -
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ మరణంపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అరుణ్ జైట్లీ మృతిపట్ల సంతాపం ప్రకటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన కేటీఆర్ …జైట్లీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జైట్లీతో తనకు మంచి అనుబంధం ఉందని..అనేక సార్లు ఆయన్ని కలుసుకునే అవకాశం దక్కిందన్నారు.
- Advertisement -