మే 31 వరకు తెలంగాణలో లాక్ డౌన్..

240
cm
- Advertisement -

మే 31 వరకు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు సీఎం కేసీఆర్. కేబినెట్ సమావేశం అనంతరం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం..తొలుత మే 29 వరకు లాక్ డౌన్ పొడగించామని దానిని మే 31 వరకు పొడగిస్తున్నట్లు తెలిపారు.

కంటైన్‌మెంట్ జోన్లు మినహా తెలంగాణమొత్తం గ్రీన్ జోన్‌లో ఉందని తెలిపారు సీఎం. కంటైన్‌మెంట్ ఏరియాల్లో పోలీస్ పహారా ఉంటుందన్నారు. కంటైన్ మెంట్ ఏరియాల్లో అన్ని వస్తువులను డోర్ డెలివరీ చేస్తామన్నారు. ప్రజలు దీనికి సహకరించాలన్నారు.

కరోనాతో కలిసి జీవించాలన్నారు సీఎం కేసీఆర్. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించామన్నారు. హైదరాబాద్ నగరం తప్ప మిగితా ప్రాంతాల్లో పూర్తిగా షాపులు తెరుచుకోవచ్చన్నారు సీఎం.

- Advertisement -