అమిత్‌ షాతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

677
kcr
- Advertisement -

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. సుమారు 40 నిమిషాల పాటు సమావేశమైన వీరిద్దరు పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు,కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయాలపై చర్చించారు.ఇక సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు.

ప్రధానితో భేటీ సందర్భంగా రెండు జీవనదులు గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేదా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరనున్నారు.

shah

కంటోన్మెంట్ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు రక్షణశాఖకు చెందిన భూములను ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం అందించే అంశంతో పాటు పన్నుల వాటా పెంచాలని ప్రధానిని కోరనున్నారు. విభజన హామీలను అమలుచేయాలని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరనున్నారు.

- Advertisement -