అఖిలేశ్‌ యాదవ్‌తో సీఎం కేసీఆర్ భేటీ..

90
CM KCR
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్త పర్యటిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు పలువురు రాజకీయ, ఆర్థిక, జాతీయ మీడియా ప్రముఖులతో కేసీఆర్‌ సమావేశమవనున్నారు. ఈ నేపథ్యంలో ఆయ‌న‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్‌ నివాసంలో ఈ భేటీ కొన‌సాగుతోంది. జాతీయ రాజకీయాలు, దేశ ప‌రిస్థితులు, ప్రాంతీయ పార్టీల బ‌లాలు, దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన వంటి అంశాల‌పై వారు చ‌ర్చిస్తున్నారు. గ‌త‌ ఉత్తరప్రదేశ్ ఎన్నికల అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై కూడా చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ ను కూడా కేసీఆర్ సందర్శించనున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం కేసీఆర్ ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ లతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -