సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డు..

257
- Advertisement -

సీఎం కేసీఆర్ ఈరోజు వ‌న‌ప‌ర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈమేరకు ఆయన వనపర్తి జిల్లా కేంద్రానికి హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో చేరుకున్నారు. వ‌న‌ప‌ర్తి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభి‌వృద్ధి కార్య‌క్ర‌మాలకు ప్రారం‌భో‌త్స‌వాలు, శంకు‌స్థా‌ప‌నలు చేయ‌ను‌న్నారు. ముందుగా జిల్లా కేంద్రానికి స‌మీపంలో ఉన్న చిట్యాల‌లో వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డును ఆయన ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా అక్క‌డ నిర్వ‌హించిన పూజా కార్య‌క్ర‌మాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, స‌బితా ఇంద్రారెడ్డితో పాటు ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డు వ‌ద్ద‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

- Advertisement -