రాష్ట్ర ఆవిర్భావం…పలువురికి సత్కారం

60
kcr cm
- Advertisement -

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా పలువురిని ఘనంగా సన్మానించారు సీఎం కేసీఆర్. కిన్నెరమెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య, అంతర్జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్‌ను సత్కరించారు సీఎం కేసీఆర్.

ఈ సందర్భంగా మొగులయ్యకు రూ.కోటి చెక్‌, క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్‌కు రూ.2 కోట్ల చొప్పున చెక్కులను అందించారు. ఇక ఇప్పటికే మొగులయ్యకు ఇంటి స్థలాన్ని అందజేసిన సీఎం…త్వరలోనే పసిడి పతకాలతో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన ఇద్దరు క్రీడాకారులకు జూబ్లీహిల్స్‌ లేదా బంజారాహిల్స్‌లో నివాస స్థలాలు ప్రభుత్వం ఇవ్వనుంది.

- Advertisement -