కరోనాపై ఉన్నతస్ధాయి కమిటీ సమావేశం

340
kcr
kcr
- Advertisement -

అసెంబ్లీలోని కమిటి హాల్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్ధాయి సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కరోనాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించనున్నారు. ఇతర రాష్ట్రాల్లోని పరిస్ధితులను కమిటీ సమీక్షించనుంది.

కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు రూ.5వేల కోట్లు అయినా ఖర్చు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం. కరోనా వైరస్ కు సంబంధించి సాయంత్రం మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈసమావేశంలో స్కూళ్లు, ఆఫీసులు, థియేటర్లకు సెలవు ఇచ్చే విషయంపై చర్చించనున్నారు.

- Advertisement -