దామరచర్లకు సీఎం కేసీఆర్..

174
kcr cm
- Advertisement -

ఇవాళ సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. దామరచర్ల లో నిర్మితమౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి పర్యవేక్షణ చేయనున్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.

సీఎం కేసీఆర్ టూర్ వివరాలు :

ఇవాళ సోమవారం (తేదీ నవంబర్ 28 ) ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుండి సిఎం కెసిఆర్ గారు దామరచర్ల పర్యటనకోసం బయలు దేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి వాయుమార్గం ద్వారా ప్రయాణించి మధ్యాహ్నం 12 గంటల కల్లా దామరచర్ల చేరుకుంటారు.

అక్కడ జరుగుతున్న థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని విద్యుత్ శాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సిఎం కెసిఆర్ పరిశీలిస్తారు. థర్మల్ పవర్ స్టేషన్ లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతి గురించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం హైద్రాబాద్ కు సిఎం కెసిఆర్ తిరుగు ప్రయాణమౌతారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -