కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

104
- Advertisement -

ఈరోజు తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికే ఈ చిత్రాన్ని విడుదల చేశారని ఆరోపించారు. రైతు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కేంద్రం ఈ సినిమాను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు.

నాడు కశ్మీర్‌లో పండిట్లను ఊచకోత కోసినప్పుడు బీజేపీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశానికి కావల్సింది కశ్మీర్ ఫైల్స్ కాదని, డెవలప్ మెంట్ ఫైల్స్ అని ఆయన స్పష్టం చేశారు. ఇక వివేక్ ఆర్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విశేషంగా ప్రజాదరణ పొందడమే కాదు, బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

- Advertisement -