రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు హోళీ శుభాకాంక్ష‌లు: సీఎం కేసీఆర్‌

353
kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా తిరిగి ప్రబలుతున్న పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడకుండా, కోవిడ్ నిబంధనలను అనుసరించి హోళీ పండుగను ఎవరిండ్లల్లో వారే జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.అంద‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ వైర‌స్ క‌ట్ట‌డిలో త‌మ వంతు పాత్ర పోషించాల‌ని కోరారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో గుమిగూడ‌టంవ‌ల్ల క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత వేగంగా ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు.

- Advertisement -