కేఆర్ ఆమోస్ మరణం పట్ల కేసీఆర్‌ సంతాపం

545
cm
- Advertisement -

సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ కన్నుమూశారు. అనారోగ్యంతో నగరంలోని మల్కాజ్‌గిరిలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. టీఎన్‌జీవో అధ్యక్షుడిగా ఆమోస్ పనిచేశారు. 1969 ఉద్యమ సమయంలో సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. తెలంగాణ కోసం మొట్టమొదటిసారి ప్రభుత్వ ఉద్యోగం తొలగించబడ్డ ఉద్యమకారుడు.

కే.ఆర్.ఆమోస్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకాలంలో ఆమోస్ ప్రదర్శించిన ఉద్యమ స్ఫూర్తిని, త్యాగనిరతిని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -