రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై సీఎం కేసీఆర్ రివ్యూ..

41
CM KCR
- Advertisement -

రాష్ట్రంలో ప్రస్తుత సంఘటనల గురించి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పోలీస్ ఉన్న‌తాధికారులతో స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. బీజేపి నేత రాజాసింగ్ చేసిన వాఖ్యల ప్రభావం వలన ఆయనకు వ్యతిరేకంగా, ఆయనను అరెస్ట్ చేయాలంటూ జరుగుతున్న అల్లర్లు, లేక వేరే కారణాల వలన జరుగుతున్న అల్లర్లు కావొచ్చు.. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ఈ స‌మావేశంలో సీఎం కేసీఆర్ అధికారులకు ముఖ్యమైన సూచనలు ఇవ్వనున్నారు. ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ల సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ ర‌వీంద్ర‌, మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌లో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం మరి కొన్ని గంటలపాటు జరగనుంది.

- Advertisement -