సీఎం కేసీఆర్ స‌వాల్ ను స్వీక‌రించిన ఉత్త‌మ్..

214
Uttam, kcr
- Advertisement -

ముఖ్య‌మంత్రి కేసీఆర్ వేసిన స‌వాల్ కు ట్వీట్ట‌ర్ ద్వారా స్పందించారు టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. నిన్న సాయంత్రం తెలంగాణ భ‌వ‌న్ లో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దానం నాగేంద‌ర్ టీఆర్ఎస్ కండువా కప్పుకున్న విష‌యం తెలిసిందే. ఈసంద‌ర్భంగా సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తోంద‌న్నారు. రాష్ట్రంలో 100పైగా అసెంబ్లీ స్ధానాల‌ను టీఆర్ ఎస్ గెలుస్తోంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఏ సర్వే చూసినా ఇవే ఫలితాలు వెలువడుతున్నాయని చెప్పారు.

kcr, uttam

ఈసంద‌ర్భంగా ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పార్టీకి ప‌ట్టం క‌డుతార‌న్నారు సీఎం కేసీఆర్. ఎన్నిక‌లు ఎప్పుడైనా రావ‌చ్చ‌ని అందుకు నాయ‌కులు, టీఆర్ఎస్ కార్య‌క‌ర్తలు సిద్దంగా ఉండాల‌ని సూచించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స్పందించారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తామే సిద్ద‌మేన‌ని ట్వీట్ చేశారు. ఎన్నిల‌కు 2019మేలో వ‌చ్చినా..2018 డిసెంబ‌ర్ లో వ‌చ్చిన కాంగ్రెస్ నేత‌లు సిద్దంగా ఉన్నార‌ని ట్వీట్ చేశారు.

- Advertisement -