కల్నల్ సంతోష్ కుటుంబానికి కేసీఆర్ పరామర్శ ‌..

487
kcr at santhosh babu home
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లారు. అక్కడ అమర జవాన్ చిత్రపటానికి నివాళి అర్పించి.. సంతోష్ కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 కోట్ల సాయాన్ని చెక్కు రూపంలో అందించారు సీఎం. కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని గౌరవిస్తూ వారి సతీమణి సంతోషికి గ్రూప్1 ఉద్యోగ నియామక పత్రంతో పాటు,రూ.5 కోట్ల చెక్కు, 570 గజాల స్థలం డాక్యుమెంట్లను అందజేశారు సీఎం కేసీఆర్.

kcr

సూర్యాపేట‌లోని క‌ల్న‌ల్ సంతోష్ నివాసానికి వెళ్లిన వారిలో విద్యుత్‌శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, రోడ్లు, భ‌వ‌నాలు, గృహ‌నిర్మాణ‌, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల‌శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌,  రాష్ట్ర సీఎస్‌ సోమేశ్ కుమార్ ఉన్నారు. 

- Advertisement -