CMKCR:గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ

41
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ తదితర కార్యక్రమాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్దిదారులతో ను క్రోడికరించి ….రాష్ట్రంలో మిగతా రైతులకు ఏవిధంగానైతే రైతుబంధు అందుతున్నదో వీరికీ అదే పధ్దతిలో రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమచేయాలన్నారు. ఇందుకు సంబంధించి…నూతనంగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను సిఎం కేసిఆర్ ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొననున్నారు. ఆర్హులైన వారికి ఇండ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను నిరుపేదలకు అందించాలని సూచించారు.

Also Read: వామ్మో ఎలక్షన్స్.. బీజేపీ భయం !

గృహలక్ష్మి పథకానికి కావాల్సిన గైడ్‌లైన్స్‌ను త్వరతిగతిన తయారు చేయాలన్నారు. జూలై నెలలో గృహలక్ష్మి పథకంను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సి ఎస్ ను సిఎం ఆదేశించారు. జూన్‌ 14వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిమ్స్ దవఖానా విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. 2000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణానికి సిఎం కేసిఆర్ శంఖుస్థాపన చేయనున్నారు.

Also Read: కాంగ్రెస్ లో ఇప్పటికైనా.. వర్గపోరు తగ్గేనా !

- Advertisement -