పట్టా పాసు పుస్త‌కాల‌పై సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు

257
CM KCR address Collectors Conference
- Advertisement -

పట్టా పాస్ పుస్తకాల పంపిణిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం కేసీఆర్. పట్టాదార్ పాస్‌పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్దేశించిన సమయంలో రైతులందరికీ అందేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరినీ సమన్వయం చేసుకుని ఏవిధంగా పంపిణీ జరగాలనేదానిపై పలు సూచనలు చేశారు.

పాస్‌పుస్తకాలు, చెక్కుల ముద్రణను వీలైనంత త్వరగా పూర్తిచేసి, మే 9 నాటికి గ్రామాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 25 లక్షల పాస్‌పుస్తకాలు ఆయాజిల్లాలకు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలతోపాటు రైతుబంధు చెక్కులను మే 10 నుంచి పంపిణీ చేయనున్నారు.

రాష్ట్రంలోని అటవీ భూములకు కూడా రైతుబంధు పథకం వర్తింపచేయాలని సూచించారు. అటవీ హక్కుల చట్టం పత్రం ఉన్నవారికి ఎకరాకు రూ. 4 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు అటవీ భూములకు ఆర్థిక సాయం వర్తింపచేస్తూ వ్యవసాయ శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -