టీఆర్ఎస్ ఉన్నంత వరకు రైతుబంధు…

367
kcr cm
- Advertisement -

తెలంగాణలో ఉంది రైతు రాజ్యం అన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్…ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ బ్రతికున్నంత వరకు రైతు బంధు పథకం కొనసాగుతుందన్నారు. కొన్ని పత్రికలు అనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నాయని ఇకపై వారు తమ పద్దతి మార్చుకోవాలన్నారు.

దేశంలో ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.దేశంలో కాంగ్రస్,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు పండించిన పంటలను కొనడం లేదన్నారు. రికార్డు స్ధాయిలో తెలంగాణలో పంటలను కొనుగోలు చేశామని తెలిపారు.

రైతుల పట్ల కమిట్‌మెంట్‌తో ఉన్నామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమంలో రాజీ పడబోమన్నారు. రైతుబంధు పధకానికి ఒక్క రూపాయి తగ్గించమన్నారు.

- Advertisement -