సుధాచంద్రన్‌కు క్షమాపణలు చెప్పిన సీఐఎస్‌ఎఫ్‌..

112
sudha
- Advertisement -

నటి, ‘మయూరి’ సుధాచంద్రన్‌కు కేంద్ర భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) క్షమాపణలు చెప్పింది. ఓ ప్రమాదంలో సుధాచంద్రన్ కాలు కొల్పోగా ఆమెకు జైపూర్ ఫూట్ అమర్చారు. అయితే ఇటీవల ఓ విమానాశ్రయానికి వెళ్లినప్పుడు అక్కడ తనిఖీలలో భాగంగా ఆమె కృత్రిమ కాలును తొలగించాలని భద్రతా అధికారులు ఆదేశించారు. దీంతో సుధాచంద్రన్ చాలా ఇబ్బందులు పడ్డారు.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా సుధాచంద్రన్ పట్ట మహిళా సిబ్బంది ప్రవర్తించిన తీరుపై విచారణ చేపడతామని పేర్కొన్నారు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు. విమాన ప్రయాణికులకు అసౌకర్యం కలిగించ వద్దని తమ సిబ్బందికి తగు సూచనలు జారీ చేస్తామని పేర్కొంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కృత్రిమ అవయవాలు తొలగించి పరిశీలించడం తమ భద్రతా సిబ్బంది విధి అని పేర్కొన్నారు.

- Advertisement -