అమెరికాలో కాల్పులు…గుంటూరు యువకుడు మృతి

212
us
- Advertisement -

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సిన్సినాటిలో జరిగిన కాల్పుల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్వీరాజ్(26) మృతి చెందారు. ఓ బ్యాంకును దోచుకునేందుకు వచ్చిన దుండగులు కాల్పులు జరపడంతో పృథ్వీతో పాటు ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు మృతి చెందారు. కాల్పులుకు పాల్పడిన ఒమర్‌ పెరాజ్‌ను పోలీసులు మట్టుపెట్టారు.

కుమారుడి మరణవార్త తెలిసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరుకు తరలించేందుకు అమెరికా ప్రతినిధులతో పృథ్వీరాజ్ బంధువులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ హౌసింగ్ బోర్డ్ ప్రధాన కార్యాలయంలో పృథ్వి తండ్రి ఉద్యోగం చేస్తున్నారు.

- Advertisement -