మునుగోడులో కాంగ్రెస్‌కు పెద్ద షాక్‌..ఎందుకో తెలుసా..

118
- Advertisement -

మునుగోడు నియోజకవర్గములో కాంగ్రెస్‌ పార్టీలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున్న గులాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా చండూరు ఎంపీపీగా ఉన్న పల్లె రవికుమార్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్‌కు చండూరులో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. చండూరు ఎంపీపీగా కొనసాగుతున్న ఆయన భార్య కళ్యాణి కూడా టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ అయ్యారు.

రవికుమార్ గౌడ్ దంపతులకు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమ కాలంలో పల్లె రవి తమతో కలిసి పని చేశారని పేర్కొన్నారు. పల్లె రవి మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీలోకి రావడం సంతోషమని ఉందన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్ విజయానికి అందరం కలిసి కృషి చేస్తామన్నారు. పల్లె రవికి భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలను పార్టీ కల్పిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -