ప్చ్.. ఆ దర్శకుడి పరిస్థితేంటి?

48
- Advertisement -

మెగాస్టార్ చింరజీవి ‘బింబిసార’ సినిమా చూసి తెగ మెచ్చుకుని, దర్శకుడు మల్లిడి వశిష్టకి వెంటనే ఆఫర్ ఇచ్చారు అని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి జరగలేదు. మెగాస్టార్ చింరజీవి తాజాగా రెండు కొత్త కథలు విన్నారు. వాటిలో ఒకటి ఒప్పుకున్నారు అని కూడా టాక్. కానీ, మల్లిడి వశిష్ట దగ్గర నుంచి మాత్రం చిరంజీవి ఎలాంటి కథ వినలేదు. పైగా మల్లిడి వశిష్టకి చిరంజీవి ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు. ప్రస్తుతం చిరు భోళా శంకర్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Also Read:Katrina:నేను గర్భవతి కాదండీ బాబు

ఇక ఈ సినిమా కాకుండా మరో సినిమా అంగీకరించారు. కానీ దర్శకుడు ఎవరు అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఓ కొత్త రచయిత చెప్పిన కథ చిరుకి బాగా నచ్చింది. అలాగే, వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. పూరి జగన్నాథ్ తో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తోంది. మొత్తమ్మీద మెగాస్టార్ – మల్లిడి వశిష్ట కాంబినేషన్ అనేది గాలి వార్త అని తేలింది. ఐతే, మరో ప్రచారం ఏంటంటే దర్శకుడు మల్లిడి వశిష్టకి బాలయ్య డేట్స్ ఇచ్చారని.

సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది అని అంటున్నారు. ఐతే ఇక్కడ పెద్ద తిరకాసు ఉంది. బాలయ్య తదుపరి చిత్రం కోసం దర్శకుడు బోయపాటి రెడీగా ఉన్నాడు. పైగా వచ్చే ఎలెక్షన్స్ కోసం ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి, బాలయ్య ఎట్టిపరిస్థితుల్లో బోయపాటి సినిమాని పోస్ట్ ఫోన్ చేయడు. మరి మల్లిడి వశిష్ట పరిస్థితి ఏమిటి ?. మళ్లీ మల్లిడి వశిష్ట కళ్యాణ్ రామ్ తోనే ముందుకు వెళ్తారా? లేదా ? అనేది వెయిట్ అండ్ సీ.

Also Read:Raj Tharun:హ్యాపీ బర్త్ డే

- Advertisement -