రంగస్ధలం ప్రీరిలీజ్..అతిథిగా సైరా

203
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌-సమంత కాంబినేషన్‌లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దృశ్యకావ్యంలా మలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు సుకుమార్‌. గతంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్తగా 1985 నాటి కాలాన్ని తలపిస్తూ సుకుమార్ తీస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Chiru to attend Rangasthalam event in Vizag

రంగస్ధలం ప్రీ రిలీజ్ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 18న వైజాగ్‌ ఆర్‌కె బీచ్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. అతిరథ మహారథుల సమక్షంలో వేడుక జరగనుంది. ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది చిత్రయూనిట్.

ఇప్పటివరకు విడుదల చేసిన రామ్‌ చరణ్‌,సమంత ఫస్ట్ లుక్స్‌ అందరిని ఆకట్టుకుంది.ఇక పాటల సంగతి చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్‌ని పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమాలో చ‌ర‌ణ్‌కి అన్న‌య్య‌గా కె.కుమార్ బాబు పాత్రలో ఆది క‌నిపించ‌నున్నాడు. ఆనాటి కాలాన్ని తలపించేలా ఉన్న సెట్టింగ్స్‌తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాడు సుకుమార్. టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించేందుకు వస్తున్న రంగస్ధలంతో సుకుమార్ చేసే మ్యాజిక్ ఏంటో తెలుసుకోవాలంటే మార్చి 30 వరకు వేచిచూడాల్సిందే.

- Advertisement -