సినిమా టికెట్ల ధర విధానంపై చిరు స్పందన..

63
- Advertisement -

సినిమా టికెట్ల ధరల విధానంపై మరోసారి పునరాలోచన చేయాలని టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవీ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్టం సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు స్పందించారు.

‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం రాష్ట్రంలో ఆన్ లైన్ టికెట్ల విధానానికి వీలు కల్పించే బిల్లు ప్రవేశపెట్టడం హర్షణీయం అని పేర్కొన్నారు. అయితే, థియేటర్ల మనుగడను దృష్టిలో ఉంచుకోవాలని, సినిమాని ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్ల ధరలపై కాలానుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ను కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా టికెట్ల ధరలను సముచిత రీతిలో నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

దేశమంతా ఒకటే జీఎస్టీతో ప్రభుత్వాలు పన్నులను వసూలు చేస్తున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండడం సమంజసం అని పేర్కొన్నారు. దయచేసి టికెట్ల ధరల అంశాన్ని పునరాలోచించాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఆ విధమైన ప్రోత్సాహం ఉన్నప్పడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందని చిరు పేర్కొన్నారు’.కాగా ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాలో నటిస్తున్నవిషయం తెలిసిందే.

- Advertisement -