చిరు- చరణ్..మల్టీ స్టారర్ ఫిక్స్?

51
- Advertisement -

తెలుగు సినీ ఇండస్ట్రీలో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందు వరుసలో ఉంటారు. ఈ ఇద్దరు తండ్రికొడుకులు కలిసి నటించాలని, మెగా అభిమానులు తరచూ కోరుకుంటూనే ఉంటారు. వీరి కోరికను తీర్చే విధంగా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్య మూవీలో నటించారు. కానీ మూవీ భారీ డిజాస్టర్ కావడంతో అభిమానుల ఆశ తీరలేదు. అయితే మరోసారి చిరు చరణ్ కలిసి నటించేందుకు అడుగులు పడుతున్నాయా అంటే అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది..

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సంచలన దర్శకుడిగా పేరు పొందిన ప్రశాంత్ నీల్ చిరు చరణ్ కోసం ఓ పవర్ ఫుల్ మల్టీ స్టారర్ స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలో ఉన్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇక ఈ మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తరువాత చిరు చరణ్ తో తీయబోయే మల్టీ స్టారర్ ను తెరకెక్కించే అవకాశం ఉందట.

Also Read:యూపీఏ మార్పు.. కాంగ్రెస్ ఒప్పుకుంటుందా?

 ఇప్పటికే స్టోరీ పనులు కూడా ప్రశాంత్ నీల్ టీం మొదలు పెట్టినట్లు టాక్. ఇదే గనుక నిజం అయితే మెగా హీరోల మాస్ ఇమేజ్ కు ప్రశాంత్ నీల్ మాస్ ఎలివేషన్స్ తోడైతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు. అయితే ఈ కాంబినేషన్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి.. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ఒకే అయ్యే అవకాశాలు ఉన్నాయట. మరి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి బోళా శంకర్ మూవీతో. బిజీగా ఉంటే.. చరణ్ శంకర్ మూవీతో బీజీగా ఉన్నాడు ఆ తరువాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయనున్నాడు.

Also Read:బీజేపీతో కలవడమా..నో ఛాన్స్!

- Advertisement -