సినిమా టికెట్ల జీవోపై ఇప్పుడు మాట్లాడను- చిరు

120
- Advertisement -

ఈరోజు అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మహిళా దినోత్సవ సంబరాలు జరిపారు. సినీ పరిశ్రమలోని మహిళలకు చిరంజీవి దంపతుల సన్మానం చేశారు. అలాగే, మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేయడం విశేషం. .

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..”సినిమా టికెట్ల జీవోపై ఇప్పుడు మాట్లాడను.. ఇది సందర్భం కాదు. నేను ఇప్పుడు ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉందన్నారు. జీవో గురించి అవసరమైతే ప్రత్యేకంగా మాట్లాడతా” అని అన్నారు. ఇక కొత్త జీవో ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని..సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రత్యేకంగా మీడియా సమావేశం పెడతాను అని అన్నారు.

కాగా, ఆంధ‍్రప్రదేశ్‌లో సినిమా టికెట‍్ల ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలుగు సినీ పరిశ‍్రమ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -