పవర్‌స్టార్ డైరెక్టర్‌తో మెగాస్టార్..!

530
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక చిరు ఈ చిత్రం త‌ర్వాత లూసిఫర్ రీమేక్ చేయ‌నున్నారు. ఇటీవ‌లే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి క్లారిటీ వ‌చ్చింది. సాహో ద‌ర్శ‌కుడు సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ఆచార్య చిత్రం పూర్తైన వెంట‌నే సెట్స్ పైకి వెళనున్నట్లు సమాచారం.

ravindra

అది అలా ఉంటే చిరంజీవి మరో సినిమాకు ఓకే చెప్పాడట. సర్ధార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబి అలియాస్ కేఎస్ రవీంద్ర తాజాగా మెగాస్టార్ కు ఒక మంచి కథను వినిపించినట్టు తెలిసింది. ఆ కథను విన్న చిరంజీవి వెంటనే ఓకే చెప్పాడట. అంతేకాదు స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి బౌండెడ్ స్క్రిప్ట్‌తో రావాలని చెప్పాడట చిరు. ఇక లూసిఫర్ రీమేక్ తర్వాత బాబీ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

- Advertisement -