శర్వానంద్‌ మా కుటుంబంలో ఒకడు- చిరు

191
- Advertisement -

శర్వానంద్ ప్రస్తుతం హీరోగా శ్రీకారం చిత్రంలో నటిస్తున్నాడు. తిరుమల కిశోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా మార్చి 11న శివరాత్రి సందర్భంగా విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

Chiranjeevi

ఈ వేడుకలో చిరు మాట్లాడుతూ, శర్వానంద్‌ను తమ కుటుంబంలో ఒకడిగానే భావిస్తామని స్పష్టం చేశారు. తమకు రామ్ చరణ్ ఎలాగో, శర్వానంద్ కూడా అంతేనని వివరించారు. శర్వా తమ కుటుంబంలో కలిసిపోతాడని పేర్కొన్నారు. ఓసారి అతడితో కలిసి ఓ యాడ్‌లో నటించానని, ఆపై శంకర్ దాదా ఎంబీబీఎస్ లోనూ తనతో శర్వా నటించాడని చిరంజీవి తెలిపారు. ఇక శ్రీకారం చిత్రం గురించి చెబుతూ… నా బిడ్డ శర్వానంద్‌కు ఆల్ ది బెస్ట్ అంటూ దీవించారు. వ్యవసాయం అవసరం, గొప్పతనం గురించి వివరించే చిత్రమిదని అన్నారు. వ్యవసాయం ఆవశ్యకతను అందరికీ వివరించేందుకు సరైన సమయంలో వస్తున్న చిత్రం అని పేర్కొన్నారు.

- Advertisement -