సంక్రాంతి బ‌రిలో చిరు..

35
- Advertisement -

ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌మేష్‌తో భోళా శంక‌ర్ సినిమా చేస్తున్న చిరంజీవి, ఆ త‌ర్వాత డైరెక్ట‌ర్ కళ్యాణ్ కృష్ణ‌తో సినిమా చేయనున్నాడ‌ని తెలుస్తోంది. ఈ మూవీలో మ‌రో యంగ్ హీరో కూడా కీల‌క పాత్ర చేయ‌నున్నట్లు వార్త‌లొచ్చాయి. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా అనౌన్స్ కానున్న ఈ మూవీని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి సంక్రాంతి బ‌రిలో నిల‌పాల‌ని చూస్తున్నాడ‌ట చిరూ. మరోపక్క ఈ సినిమాలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించబోతున్నాడు. సిద్దు జొన్నలగడ్డ చిరంజీవి కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడు.

పైగా సిద్దు జొన్నలగడ్డ కు జోడీగా శ్రీలీల నటించబోతుంది. అలాగే చిరంజీవికి జోడీగా త్రిష నటించబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలో త్రిషను కథానాయికగా ఖరారు చేశారు. ఆమె ఈ సినిమా 2 కోట్లు డిమాండ్ చేస్తోంది. అయినా, మెగా టీమ్ ఆ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించటం విశేషం. మొత్తమ్మీద 15 ఏళ్ళ తర్వాత చిరు – త్రిష కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. గతంలో స్టాలిన్ లో చిరంజీవి సరసన త్రిష సందడి చేసింది. ఆ సినిమాలో వీరి జోడి పై మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి.

Also Read: కాటుక కనుల దిశా ఇన్‌ ప్రాజెక్ట్‌ K

ఈ సినిమాను మెగాస్టార్ కూతురు సుస్మిత భారీ బడ్జెట్ తో సొంత బ్యానర్ లో నిర్మిస్తోంది. పైగా మెగాస్టార్ ఈ సినిమాలో ఏభై ఐదేళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఐతే మలయాళ సినిమా ‘బ్రో డాడి’కి ఈ సినిమా రీమేక్ అని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Also Read: ప్రశంసలు, శాపనార్ధాలు.. మధ్యలో రకుల్

- Advertisement -