Chiru:కుర్ర దర్శకుల వెంటే మెగాస్టార్?

16
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కుర్ర దర్శకులకే అధిక ప్రదాన్యం ఇస్తున్నాడా అంటే ఆయన స్టోరీ సెలక్షన్ చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్టార్ డైరెక్టర్స్ కాకుండా యంగ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ లు ఇస్తూ తనను తను కొత్తగా చూపించుకునేందుకు ఆరాటపడుతున్నాడు మెగాస్టార్. గత ఏడాది బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య మూవీ చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన భొళా శంకర్ డిజాస్టర్ కావడంతో ఇక తన తరువాతి సినిమాలన్నీ కుర్ర దర్శకులతోనే చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే ఫాంటసీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత మెగాస్టార్ చేసే సినిమా ఏది అనే దానిపై క్లారిటీ లేనప్పటికి దాదాపు నలుగురు కుర్ర దర్శకులు లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. .

అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల వంటి కుర్ర దర్శకులు మెగాస్టార్ తో పని చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వీరితో పాటు మరికొంతమంది కొత్త దర్శకుల పేర్లు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అలాగే హరీష్ శంకర్ కూడా చిరు కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఏక ఎప్పటి నుంచో పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్లు మెగాస్టార్ తో పని చేసేందుకు కథలు అల్లే పనిలో ఉన్నారు. మరి వీరిలో మెగాస్టార్ సీనియర్స్ వైపు మొగ్గు చూపుతాడా లేదా కుర్ర దర్శకులే తన ఛాయిస్ అంటాడా అనేది మెగా అభిమానులను తోలుస్తున్న ప్రశ్న. అయితే సీనియర్ దర్శకులను నమ్ముకొని ఆచార్య, భోళా శంకర్ వంటి డిజాస్టర్స్ చవిచూసిన చిరు.. సీనియర్స్ తో రిస్క్ చేయకుండా తన తదుపరి సినిమాలను యంగ్ డైరెక్షర్స్ తోనే చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి, మరి ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆ స్థాయి విజయం లేని మెగాస్టార్ తన తదుపరి సినిమా విశ్వంభర తో అదిరిపోయే హిట్ కొడతాడేమో చూడాలి.

Also Read:మూవీ రివ్యూ…’లంబసింగి’

- Advertisement -