శతమానం భవతి సక్సెస్ మీట్‌కు మెగాస్టార్‌….

220
Chiranjeevi
- Advertisement -

దిల్‌రాజు నిర్మాతగా సతీష్‌వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన సినిమా శతమానం భవతి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అయ్యిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో ఆగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ లాంటి పెద్ద హీరోలతో సినిమా పోటీని తట్టుకుని మంచి విజయాన్ని సాధించింది శతమానం భవతి. విదేశాల్లో స్థిరపడిపోయి ఇంటిని మరిచిపోయిన పిల్లలు, వారిని చూడాలని రోజూ కలలు కనే తల్లిదండ్రుల బాధలు, కుటుంబ విలువలను చెబుతూ తీసిన ఈసినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈసినిమా ఇప్పటికే 25 కోట్ల రూపాయిలను రాబ్బట్టగా… ఇంకా బాక్స్‌ఫీస్‌వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తునే ఉంది.

Chiranjeevi as special guest for Shatamanam Bhavati Success Meet

అయితే శతమానం భవతి గ్రాండ్ సక్సెస్ ను పురస్కరించుకుని.. ఇవాళ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశాడు నిర్మాత దిల్ రాజు. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్.. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్.. దర్శకుడు సతీష్ వేగేశ్నతోపాటు.. మొత్తం శతమానం టీం హాజరవుతున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించాడు నిర్మాత దిల్ రాజు. అయితే ఈ ఆహ్వానం అందుకున్న చిరు.. తప్పినసరిగా శతమానం భవతి సక్సెస్‌ మీట్‌కు హాజరవుతానని మాటిచ్చేశాడట.

Chiranjeevi as special guest for Shatamanam Bhavati Success Meet

తన సినిమాకు పోటీ వచ్చిన సరే శర్వనంద్‌ సినిమా సక్సెస్‌మీట్‌కి హాజరవుతూన్న చిరు వ్యక్తిత్వాన్నికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు. చిరు సపోర్ట్‌తో కూడా మరికొన్ని రోజులపాటు శతమానం భవతి తన సత్తా చాటనుందని శర్వానంద్‌ అభిమానులు సంబరపడుతున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి రాకతో ప్రత్యేకతను సంతరించుకోనుంది. నిర్మాతగా ఈ సినిమా దిల్ రాజుకి కాసుల పంట పండిస్తే, కెరియర్ పరంగా ఈ సినిమా శర్వానంద్ కి…. అనుపమకి ఎంతో హెల్ప్ అయిందనే సినీ ప్రేక్షకులు చెవులుకొరుకుంటున్నారు.

- Advertisement -