వీరయ్య సక్సెస్ పై చిరు స్పందన

75
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ‘వాల్తేరు వీరయ్య’ మూవీ సాలిడ్ కలెక్ష‌న్లను రాబ‌ట్టింది. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ సందర్భంగా చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరీ ఆ కామెంట్స్ ఏమిటో మెగాస్టార్ మాటల్లోనే.. ‘దర్శకులు బాధ్యతతో సినిమాలు తీయాలి. ఖర్చు నియంత్రణలో ఉండాలి. ముందు నిర్మాతలను బతికించండి. నిర్మాతలు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది అంటూ చిరంజీవి తెలిపారు.

వాల్తేర్ వీర‌య్య సినిమా విజ‌యం అందరి కృషి వ‌ల్లే సాధ్య‌పడిందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ర‌వితేజ పాత్ర వ‌ల్లే వాల్తేర్ వీర‌య్య సెకండాఫ్‌కు అందం వ‌చ్చింద‌ని చిరంజీవి తెలిపారు. ర‌వితేజ‌ను త‌న త‌మ్ముడిగానే భావిస్తాన‌ని.. అందువ‌ల్లే తనతో కలిసి న‌టిస్తున్న‌ప్పుడు గ్లిజ‌రిన్ లేకున్నా కూడా క‌న్నీళ్లు వచ్చేశాయని చిరు అన్నారు. బాబీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మొదటి షోతో హిట్ టాక్ తెచ్చుకొని.. బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా 3 డేస్ లో రూ.108 కోట్లు గ్రాస్ కలక్షన్స్ ని రాబట్టిందని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమా చూస్తున్న ఫ్యాన్స్ కు థియేటర్లో పూనకాలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -