బాలల దినోత్సవం…గ్రీన్ ఛాలెంజ్

99
- Advertisement -

బాలల దినోత్సవం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు స్పైస్ స్కూల్ , సిద్ధిపేట జిల్లా . రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ప్రిన్సిపాల్ శ్రీకాంత్ రెడ్డి గారు , ఉపాధ్యాయ బృందం సంగీత , భారతి , అనూష , పూర్ణిమ నరేష్ ,రాజు మరియు విద్యార్ధి విద్యార్థులు .

ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిద్ధిపేట నియోజక వర్గ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే మొక్కలు విరివిగా నాటేవారు , దీనివల్ల సిద్దిపేట లో పచ్చధనం ఎంతో ఆహ్లదాన్ని ఇస్తుంది ,వాతావరణం చల్లగా ఉంటుంది . తమ పాఠశాల తరుపున ప్రతి విద్యార్థి కి పుట్టిన రోజు సందర్బంగా మొక్కలు బహుమతిగా ఇస్తామన్నారు . మొక్కల పెంపకం పైన , వాటి సంరక్షణ పైన అవగాహాన కల్పిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -