మావోయిస్టుల కాల్పుల్లో 24 మంది జవాన్ల మృతి..

222
Chhattisgarh encounter
- Advertisement -

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా–బీజాపూర్ సరిహద్దుల్లో శనివారం భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో మావోయిస్టుల మ‌ధ్య కాల్పులు ఇంకా కొన‌సాగుతున్నాయి. అయితే ఈ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన జవాన్ల సంఖ్య పెరుగుతోంది. తొలుత ఐదుగురు జవాన్లే చనిపోయారని అధికారులు ప్రకటించినా.. ఆదివారం మధ్యాహ్నం నాటికి వారి సంఖ్య 24కి పెరిగింది.

మ‌రో 43 మంది జవాన్లు స్వ‌ల్ప గాయాలతో బయటపడగా, ఇంకో 13 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ఈ మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అధికారులు ప్రకటించారు. కాగా, మావోయిస్టులూ భారీగానే హతమైనట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, కాల్పుల్లో చనిపోయిన జవాన్ల త్యాగాన్ని వృథా కానివ్వబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాఘల్ తెలిపారు.

- Advertisement -