చెన్నై టెస్టు…భారత్ 337 ఆలౌట్

209
sundar
- Advertisement -

చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 337 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 6 వికెట్ల‌కు 257 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌ మరో 80 పరుగులు జోడించి ఆలౌటైంది.

నాలుగోరోజు వాషింగ్టన్ సుందర్,అశ్విన్ ఇంగ్లాండ్‌ బౌలర్లను ప్రతిఘటించారు. అశ్విన్ 31 పరుగులు చేసి ఔటైనా మరో ఎండ్‌లో సుందర్‌ తన పొరటాన్ని కొనసాగించాడు. ముఖ్యంగా తన కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదుచేశాడు సుందర్. 138 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు సుందర్. శుభ్‌మన్ గిల్ 29,పుజారా 73,పంత్ 91,అశ్విన్ 31 పరుగులు చేశాడు.

ఇంగ్లాండ్ బౌలర్లలో డొమినిక్ బెస్ 4,ఆర్చర్ 2,లీచ్ 2,అండర్సన్ 1 వికెట్ తీశారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ కాగా రూట్ డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -